ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
ABN , First Publish Date - 2022-08-18T04:54:30+05:30 IST
అద్దంకిలోని పురుగుమందులు, ఎరువుల దుకాణాలపై బుధవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ కస్మిక తనిఖీలు నిర్వహించారు. అద్దంకిలోని వెంకట శివసాయి ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహించి ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారని గుర్తించి రూ. 33, 750 విలువ కలిగిన ఎరువులను సీజ్ చేశారు. అలాగే సరైన పత్రాలు లేనందున 1,08,000 రూపాయల విలువ చేసే పురుగు మందుల అమ్మకాలను నిలుపుదల చేశారు.
అద్దంకిటౌన్, ఆగస్టు 17: అద్దంకిలోని పురుగుమందులు, ఎరువుల దుకాణాలపై బుధవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ కస్మిక తనిఖీలు నిర్వహించారు. అద్దంకిలోని వెంకట శివసాయి ట్రేడర్స్ లో తనిఖీలు నిర్వహించి ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నారని గుర్తించి రూ. 33, 750 విలువ కలిగిన ఎరువులను సీజ్ చేశారు. అలాగే సరైన పత్రాలు లేనందున 1,08,000 రూపాయల విలువ చేసే పురుగు మందుల అమ్మకాలను నిలుపుదల చేశారు. అలాగే ఆంజనేయ ట్రేడర్స్లో రూ. 85,000 విలువ గలిగిన పురుగు మందుల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ టి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకట కృష్ణ, రెవెన్యూ అధికారులు ఉన్నారు.