వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ABN , First Publish Date - 2022-05-28T05:44:06+05:30 IST
వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎస్ఐ కె.నాగరాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.రమేష్బాబు హెచ్చరించారు.
ఆకివీడు, మే 27: వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ ఎస్ఐ కె.నాగరాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్.రమేష్బాబు హెచ్చరించారు. కిరాణా, ఫ్లోర్మిల్లో శుక్రవారం తనిఖీలు చేసి 1130 లీటర్ల పీపాల్లో మంచినూనె సీజ్ చేశారు. వ్యాపారులు విక్రయించే ప్రతీ వస్తువుపై తయారీ తేదీ, కాలపరిమితి ముగిసే తేదీ, ఎంఆర్పీ కచ్చితంగా ఉండాలన్నారు. కారం మిల్లులో నాశిరకం మిరపకాలు తెచ్చి రంగు వేసి అమ్మకాలు చేస్తున్నారని ఫిర్యాదు అందిందన్నారు.