కామాక్షితాయిని దర్శించుకున్న ఏపీ విజిలెన్స్ అధికారులు
ABN , First Publish Date - 2022-07-03T05:32:05+05:30 IST
ఏపీ విజలెన్స్ శాఖ కార్యాలయ సీసీ, అధికారులు కె. వర్మ, డి. నాగిరెడ్డి కుటుంబ సమేతంగా మండలంలోని జొన్నవాడ ఆలయంలో శనివారం శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు.
బుచ్చిరెడ్డిపాళెం,జూలై2: ఏపీ విజలెన్స్ శాఖ కార్యాలయ సీసీ, అధికారులు కె. వర్మ, డి. నాగిరెడ్డి కుటుంబ సమేతంగా మండలంలోని జొన్నవాడ ఆలయంలో శనివారం శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిలను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారి గోత్రనామాలతో స్వామి, అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారికి ఆలయ చైర్మన్ ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. వారి వెంట వజిలెన్స్ సీఐ కె. సుధాకర్ ఉన్నారు.