విద్యార్థులకు అక్షరాభ్యాసం
ABN , First Publish Date - 2022-07-07T02:55:47+05:30 IST
బుచ్చి నగర పంచాయతీ పరిధి రామచంద్రాపురంలోని ప్రాఽథమికోన్నత పాఠశాలలో బుధవారం కొత్తగా పాఠశాలలో చేరిన వి
బుచ్చిరెడ్డిపాళెం,జూలై6: బుచ్చి నగర పంచాయతీ పరిధి రామచంద్రాపురంలోని ప్రాఽథమికోన్నత పాఠశాలలో బుధవారం కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం వారికి దొడ్ల కోదండరామిరెడ్డి విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగవచ్చన్నారు. పాఠశాలకు విద్యుత్ గంటను త్వరలోనే బహూకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, రిసోర్సు సభ్యులు గండికోట సుదీర్కుమార్, ఉపాధ్యాయులు బ్రహ్మారెడ్డి, వేణు, విజయనిర్మల, రసూల్బేగం తదితరులు పాల్గొన్నారు.