విద్యార్థులకు విద్యాకానుక కిట్లు
ABN , First Publish Date - 2022-07-06T05:42:10+05:30 IST
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి స్థాపనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు.
భీమవరం, జూలై 5: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి స్థాపనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం మూడో విడత జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోని నుంచి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి భీమవరం కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో 1,413 పాఠశాలల్లోని 1,39,782 మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశా మన్నారు. ఒక్కొక్కటి రూ.1,964 విలువైన విద్యా కానుక కిట్లను అందజేశారు. ఇందులో మూడు జతల యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీతో కూడిన జీవీకే కిట్లను అందజేశామన్నారు. జేసీ జేవీ మురళి, డీఆర్వో కె.కృష్ణవేణి, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.