42,745 మందికి విద్యా దీవెన
ABN , First Publish Date - 2022-08-12T06:23:26+05:30 IST
42,745 మందికి విద్యా దీవెన
రూ.24,28,72,707 చెక్కు విడుదల చేసిన కలెక్టర్
అనకాపల్లి కలెక్టరేట్, ఆగస్టు 11: విద్యా దీవెన పథకం కింద ఏప్రిల్- జూన్ నెలలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ చెక్కును కలెక్టర్ రవి పట్టన్శెట్టి గురువారం కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 42,745 మంది విద్యార్థులకు 24 కోట్ల 28 లక్షల 72 వేల 707 రూపాయలను వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు చెప్పారు. వీరిలో 38,560 మంది బీసీ విద్యార్థులకు రూ.22,08,86,047, 3,341 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.1,79.81,377, 583 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.24,18,460, 261 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.15,86,223 మంజూర య్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అజయ్బాబు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.