విద్యుదాఘాతంతో గేదెలు మృతి

ABN , First Publish Date - 2022-05-19T02:42:36+05:30 IST

విద్యుదాఘాతానికి గురై బుధవారం తిమ్మారెడ్డిపల్లిలో మూడు గేదెలు మృతిచెందా యి. గ్రామానికి చెందిన జడప్రోలు సుందరరా

విద్యుదాఘాతంతో గేదెలు మృతి
మృతి చెందిన గేదెలు

వరికుంటపాడు, మే 18: విద్యుదాఘాతానికి గురై బుధవారం తిమ్మారెడ్డిపల్లిలో మూడు గేదెలు మృతిచెందా యి.   గ్రామానికి చెందిన జడప్రోలు సుందరరామిరెడ్డి అనే రైతుకు చెందిన ఓ గేదె, రెండు దూడలు మేత కోసం గ్రామ శివారు పొలాలకు వెళ్లాయి.సమీపంలోనే త్రిఫేజ్‌ విద్యుత్‌ సరఫరా తీగలు తెగి నేలపై పడి ఉండడంతో అటుగా వెళ్లిన ఆ గేదెలు వాటిని తగిలి అక్కడేకక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని మృతిచెందిన గేదెలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-19T02:42:36+05:30 IST