విధులకు బయలుదేరి తిరిగిరాని లోకాలకు..!

ABN , First Publish Date - 2022-05-22T05:05:37+05:30 IST

ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వస్తున్న బొలేరో వాహనం ఢీ కొనడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు.ఈ సంఘటన మండలంలోని నరసాపురం దగ్గర శనివారం జరిగింది.

విధులకు బయలుదేరి  తిరిగిరాని లోకాలకు..!
ఎం.శ్రీహరి (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి


గుడ్లూరు/కొండాపురం, మే 21 : ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వస్తున్న బొలేరో వాహనం ఢీ కొనడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు.ఈ సంఘటన మండలంలోని నరసాపురం దగ్గర శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు, కొండాపురం పోలీ్‌సస్టేషనలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.శ్రీహరి(55) కావలి వాయునంద ప్రెస్‌ వీధిలో నివాసం ఉంటున్నాడు. విధులకు వెళ్లేందుకు ఉదయాన్నే కావలి నుంచి ద్విచక్ర వాహనంపై కొండాపురం బయలుదేరాడు. మార్గమధ్యంలో నర్సాపురం దగ్గరకు రాగానే వెనుక నుంచి వస్తున్న బొలేరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనను గమనించిన  స్థానికులు తీవ్రంగా గాయపడిన శ్రీహరిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే శ్రీహరి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరణ చేశారు. పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై మల్లిఖార్జున  తెలిపారు.


స్టేషనలో విషాదఛాయలు


ఈ ఘటనతో శ్రీహరి కుటుంబంతోపాటు  కొండాపురం పోలీస్టేషన్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి బార్య, ఇద్దరు ఆమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కావలి డీఎ్‌సపీ ప్రసాదు, కలిగిరి సీఐ సాంబశివరావు, ఎస్సై ఖాజావళి వైద్యశాలకువెళ్లి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. 

Updated Date - 2022-05-22T05:05:37+05:30 IST