ఇద్దరు మహిళలపై పురుషుల దాడి...వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-05-28T16:05:45+05:30 IST

ఓ భూవివాదంపై ఇద్దరు మహిళలపై పురుషులు దాడి చేసి కొట్టిన దారుణ ఘటన వీడియో వైరల్ గా మారింది.

ఇద్దరు మహిళలపై పురుషుల దాడి...వీడియో వైరల్

డియోరియా (ఉత్తరప్రదేశ్): ఓ భూవివాదంపై ఇద్దరు మహిళలపై పురుషులు దాడి చేసి కొట్టిన దారుణ ఘటన వీడియో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథిలా ఉపాధ్యాయ్ గ్రామంలోని లార్ ప్రాంతంలో ఏర్పడిన భూవివాదంతో కొందరు పురుషులు ఇద్దరు మహిళలపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై బాధిత మహిళల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీపతి మిశ్రా చెప్పారు. 

Updated Date - 2020-05-28T16:05:45+05:30 IST