Viral Video: రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై నేల మీద కూర్చున్న యువతి.. ప్రయాణీకులు అంతా చూస్తుండగానే..

ABN , First Publish Date - 2022-04-25T17:55:13+05:30 IST

కొందరు మనుషులు సాటి మనుషులపై కూడా ఎలాంటి జాలీ చూపకుండా కఠినంగా వ్యవహరిస్తారు.

Viral Video: రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై నేల మీద కూర్చున్న యువతి.. ప్రయాణీకులు అంతా చూస్తుండగానే..

కొందరు వ్యక్తులు సాటి మనుషులపై కూడా ఎలాంటి జాలీ చూపకుండా కఠినంగా వ్యవహరిస్తారు. మరికొందరు మాత్రం జంతువులపై కూడా ప్రేమను కురిపిస్తారు. పెంపుడు జంతువుల పైనే కాదు.. వీధుల్లో తిరిగే వాటి పట్ల కూడా దయతో వ్యవహరిస్తారు. తాజాగా పశ్చిమబెంగాల్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ వీధి కుక్కకు పెరుగు అన్నం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


పశ్చిమ బెంగాల్‌లోని దమ్ దమ్ కంటోన్మెంట్‌లోని రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ రైల్వే ప్లాట్‌ఫామ్ మీద కూర్చుని ఓ వీధి కుక్కకు ప్రేమగా పెరుగన్నం తినిపించింది. ఆ కుక్క పెరుగన్నం తప్ప ఇంకేం తినదట. అందుకే ఆ మహిళ రోజుకు మూడుసార్లు రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆ కుక్కకు పెరుగన్నం పెడుతుందట. ఈ ఘటనను స్టేషన్‌లో ఉన్న ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కొద్ది గంటల్లోనే వేల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది.  



Updated Date - 2022-04-25T17:55:13+05:30 IST