దేశంలోనే గొప్ప వైద్యవిధానం రాష్ట్రంలో ఉంది: రజిని

ABN , First Publish Date - 2022-04-12T02:04:20+05:30 IST

దేశంలోనే గొప్ప వైద్యవిధానం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

దేశంలోనే గొప్ప వైద్యవిధానం రాష్ట్రంలో ఉంది: రజిని

చిలకలూరిపేట: దేశంలోనే గొప్ప వైద్యవిధానం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామంత్రి విడదల రజిని పేర్కొన్నారు. నూతనంగా రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా నియమితులైన రజిని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి వైద్యఆరోగ్యశాఖ అత్యంత కీలకమైనదన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలను నిర్మిస్తోందన్నారు. ప్రతి గ్రామానికి క్లినిక్‌లను అందుబాటులో తీసుకువచ్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. వైద్యఆరోగ్యశాఖలో గణనీయంగా నియామకాలు చేపట్టి జగనన్న చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీని మెరుగుపరచి పేదలందరికీ ఉచిత నాణ్యమైన వైద్యం అందేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలబడిందని, ఉచితంగా వైద్యం అందించి దేశం మొత్తం చర్చించుకునేలా తమ ముఖ్యమంత్రి కృషి చేశారని రజిని కొనియాడారు. 


Updated Date - 2022-04-12T02:04:20+05:30 IST