సుదీర్ఘపోరాటాలతోనే విజయం సాధ్యం
ABN , First Publish Date - 2022-08-19T04:48:35+05:30 IST
మదనపల్లెలోని బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో 282 రోజులు నిర్వ హించిన సుదీర్ఘపోరాటంతోనే విజ యం సాధించామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి పేర్కొ న్నా రు.
మదనపల్లె టౌన్, ఆగస్టు 18: మదనపల్లెలోని బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని ఏఐఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో 282 రోజులు నిర్వ హించిన సుదీర్ఘపోరాటంతోనే విజ యం సాధించామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి పేర్కొ న్నా రు. గురువారం స్థానిక బీటీ కళా శాల వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు చేపట్టిన రిలేదీక్షలను విరమించి, విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ నేటి పరిస్థి తుల్లో దీర్ఘకాలం పోరాటం చేస్తే తప్ప సమస్యలు పరిష్కరాం అయ్యేలా కనపడటం లేదన్నారు. తమ పోరాటానికి సహకరించి మద్దతు పలికిన ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎంపీ మిధున్ రెడ్డి చూపిన చొరకు ఆయనకు ప్రత్యేకంగా దన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇదే రీతిలో అన్నమయ్య జిల్లాలో యూనివర్శిటీ ఏర్పాటుకు బీటీ కళాశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నవీన్, మాధవ్ పాల్గొన్నారు.