అనుమతి పత్రాలు చూపించినా వదలడంలేదు.. బాధితుల ఆవేదన
ABN , First Publish Date - 2021-05-14T17:06:09+05:30 IST
ఏపీ, తెలంగాణ సరిహద్దు దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ సరిహద్దు దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ నుంచి వస్తున్నఅంబులెన్స్లను తెలంగాణ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అంబులెన్స్లు నిలిచిపోతున్నాయి. విజయవాడ సింగ్నగర్కు చెందిన వినోద అనే వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతోంది. హైదరాబాద్లోని చికిత్స పొందేందుకు అనుమతి పత్రం చూపినా తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. పరిస్థితి విషమంగా ఉంటే ఇలాంటి కొత్త ఆంక్షలేంటని బాధితురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.