ప్రజావాణిలో బాధితుల విన్నపాలు

ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రబలడంతో కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

ప్రజావాణిలో బాధితుల విన్నపాలు

సంగారెడ్డి రూరల్‌, జూన్‌ 21 : కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రబలడంతో కొవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ ఉన్నందున ప్రజావాణికి వచ్చేవారు కూడా రాకపోవడంతో కలెక్టర్‌ కార్యాలయం బోసిపోయేది. 45 రోజుల సుదీర్ఘ విరామం తరువాత లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో అధికారులు, ప్రజావాణికి వచ్చిన అర్జీదారులతో సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణం కిక్కిరిసింది. వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను ఇన్‌వార్డు సెక్షన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన డబ్బాలో వేశారు. 

Updated Date - 2021-06-21T05:30:00+05:30 IST