హత్య కేసులో నిందితుడి అరెస్టు
ABN , First Publish Date - 2021-10-24T05:46:35+05:30 IST
డబ్బు విషయంలో తగాదాపడి తోటి పనివాడిని హతమార్చిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు భీమవరం టూటౌన్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు.
భీమవరం క్రైం, అక్టోబరు 23 : డబ్బు విషయంలో తగాదాపడి తోటి పనివాడిని హతమార్చిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు భీమవరం టూటౌన్ సీఐ కృష్ణకుమార్ తెలిపారు. శనివారం భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది నవంబరులో విజయవాడ కాంట్రాక్టర్ ద్వారా ఉండిలో అపార్ట్మెంట్కు రంగులు వేసేందుకు కొంత మందిని యూపీలోని గోరఖ్పూర్ నుంచి తీసుకువచ్చారని, వారు రోజూ రంగులు వేసి రాత్రిపూట అక్కడే నిదప్రోయేవారన్నారు. వీరిలో సహ్లద్ సహానీ, కన్నయ్యలాల్ మౌర్య డబ్బు విషయంలో గొడవ పడ్డార ని, కన్నయ్యలాల్ మౌర్య నిద్రపోతున్న సహ్లాద్ సహానీని కర్రతో కొట్టి, కాళ్ళతో తన్ని హత్య చేసి పరారయ్యాడన్నారు. ప్రత్యేక బృందం గోరఖ్పూర్ వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి శనివారం భీమవరం రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. ఉండి ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐలు కె. ధర్మ, బాజీని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, డీఎస్పీ వీరాంజనేయరెడ్డి అభినందించినట్టు తెలిపారు. సమావేశంలో భీమవరం టూటౌన్ ఎస్ఐ అప్పారావు పాల్గొన్నారు.