సుష్మాస్వరాజ్ను గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు
ABN , First Publish Date - 2020-08-03T20:45:32+05:30 IST
రక్షాబంధన్ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మారాజ్ను గుర్తుచేసుకున్నారు.
న్యూఢిల్లీ: రక్షాబంధన్ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మారాజ్ను గుర్తుచేసుకున్నారు. ప్రతి ఏడాదీ రక్షాబంధన్ రోజున తన ఇంటికి వచ్చి రాఖీకట్టివేళ్లే సుష్మాస్వరాజ్ ఈసారి జ్ఞాపకంగా మిగిలిపోయారని అన్నారు. ‘సోదరీ సుష్మాస్వరాజ్జీ....రక్షాబంధన్ సందర్భంగా మీరు చాలా గుర్తొస్తున్నారు’ అని వెంకయ్యనాయుడు ట్వీట్చేశారు.