దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: వెంకయ్య

ABN , First Publish Date - 2020-08-15T13:33:08+05:30 IST

దేశ ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియాజేశారు.

దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: వెంకయ్య

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియాజేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను వెంకయ్య గుర్తుచేసుకున్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. కుల, మత, లింగ వివక్షతలేని సమసమాజ స్థాపనకు కృషిచేస్తూ.. పేద-ధనిక, గ్రామీణ-పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం. వైభవోపేతమైన చరిత్ర, ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలు భారతదేశానికున్న విలువైన సంపద. వీటిని భవిష్యత్ తరాలకు అందిస్తూ.. మనదేశ యువశక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ‘ఆత్మనిర్భర భారత్’ సంకల్పంతో ప్రతి పౌరుడూ ముందుకు సాగాల్సిన తరుణమిది’’ అంటూ వెంకయ్య ట్వీట్ చేశారు.



Updated Date - 2020-08-15T13:33:08+05:30 IST