తిరుపతి: ఐఐటికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
ABN , First Publish Date - 2021-03-04T15:38:40+05:30 IST
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏర్పేడులోని ఐఐటి కళాశాలకు బయలుదేరి వెళ్లారు.
తిరుపతి: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏర్పేడులోని ఐఐటి కళాశాలకు బయలుదేరి వెళ్లారు. చెన్నై నుండి వాయుసేన ప్రత్యేక విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఐఐటికి బయలుదేరారు. ఐఐటి కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖిలో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు. ఉదయం 11:20 గంటలకు తిరుపతిలోని అమర ఆసుపత్రి ప్రారంభించి, మధ్యాహ్నం 12:15 గంటలకు గల్లా రామచంద్రనాయుడు నివాసానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు గల్లారామచంద్రనాయుడు నివాసం నుంచి తిరుమలకు బయలుదేరి, రాత్రి తిరుమల పద్మావతి అతిథి గృహంలో వెంకయ్యనాయుడు బస చేయనున్నారు.