రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: Venkaiah

ABN , First Publish Date - 2021-11-14T18:15:24+05:30 IST

అన్నదాతలైన రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: Venkaiah

నెల్లూరు: అన్నదాతలైన రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకలలో వెంకయ్య పాల్గొని ప్రసంగించారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో..సేవాలయానికి వెళ్లినా అంతే పుణ్యమన్నారు.  సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతానని తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్టును పరిశీలించాలని అందరినీ ఆహ్వానిస్తుంటానన్నారు. సేవా సంస్థలను ప్రోత్సహిస్తారనే కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. ఏ పదవిలో ఉన్నా స్వర్ణభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలని... యువతకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్లపై నిలబడేలా చేయాలని వెంకయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-14T18:15:24+05:30 IST