ఆహార దినోత్సవం.. రైతన్నను గుర్తు చేసుకుందాం: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-10-16T20:40:51+05:30 IST

ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యలు లేని

ఆహార దినోత్సవం.. రైతన్నను గుర్తు చేసుకుందాం: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యలు లేని సమాజం దిశగా ముందుకు సాగుదామన్నారు. ముఖ్యంగా యువత జంక్ ఫుడ్స్‌ను విడిచిపెట్టి సంప్రదాయ పోషకాహారం మీద దృష్టి పెట్టాలని సూచించారు. ‘‘కరోనా నేపథ్యంలో ప్రపంచానికి సవాలుగా మారిన ఆహారభద్రతను అధిగమించే దిశగా.. మనల్ని ఆదుకున్న రైతన్నల శ్రమను ఆహార దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం. వివాహాది కార్యక్రమాల్లో ఆడంబరాలను తగ్గించుకుని ఆహార వృధాను తగ్గించేందుకు మన వంతు ప్రయత్నం చేద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. 



Updated Date - 2020-10-16T20:40:51+05:30 IST