మీ ప్రార్థనలు, సేవలకు ధన్యవాదాలు: వెంకయ్యనాయుడు
ABN , First Publish Date - 2020-10-12T22:42:17+05:30 IST
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా నెగిటివ్గా తేలింది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా సంక్రమణ అనంతరం వైద్యుల సూచన మేరకు తన స్వీయనిర్బంధ కాలం పూర్తయిందని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా నెగిటివ్గా తేలింది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా సంక్రమణ అనంతరం వైద్యుల సూచన మేరకు తన స్వీయనిర్బంధ కాలం పూర్తయిందని ఆయన అన్నారు. ఈ రోజు ఎయిమ్స్ బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నట్టు తెలిపారు.
స్వీయనిర్బంధంలో ఉన్న సమయంలో ఎంతో మంది తన ఆరోగ్య పరిస్థితి గురించి ఉత్తరాలు, మెయిల్స్, మెసేజ్ల ద్వారా వాకబు చేశారని గుర్తు చేసుకున్నారు. అన్ని ప్రాంతాలు, పార్టీలు, మతాలకు అతీతంగా తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, అనేక మంది ప్రార్థనలు చేశారన్నారు. వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా సంక్రమణ సమయంలో తనకు అవసరమైన ఆరోగ్య సేవలందించిన వైద్యులు, ఇతర వైద్యసిబ్బందికి, అలాగే తనకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన తన వ్యక్తిగత సహాయకులకు కృతజ్ఞతలు చెప్పారు.