వైభవంగా అయ్యపనాయుడు కల్యాణం
ABN , First Publish Date - 2022-08-12T03:38:00+05:30 IST
మండలంలోని కమ్మవారిపాలెంలో ఉన్న దేవీసమేత అయ్యపనాయుడు స్వామివార్లకు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని గురు
జలదంకి, ఆగస్టు11: మండలంలోని కమ్మవారిపాలెంలో ఉన్న దేవీసమేత అయ్యపనాయుడు స్వామివార్లకు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం కల్యాణం నిర్వహించారు. ఆలయ పూజారులు శివకుమార్, సుబ్రహ్మణ్యంలు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ముఖద్వారం ఎదురుగా ఉన్న జమ్మి, రావిచెట్టులకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం జరిగింది. కార్యక్రమంలో సర్పంచి తమ్మినేని సతీష్నాయుడు, ఉపసర్పంచి పరిమి ప్రతాప్, మాజీసర్పంచి తమ్మినేని వరలక్ష్మమ్మ. అలయ కమిటీ చైర్మన్ మక్కెన కొండపనాయుడు, తదితరులు పాల్గొన్నారు.