ఢిల్లీలోనూ వై-ఫై కాలింగ్ సేవలు.. ప్రారంభించిన వొడాఫోన్ ఐడియా
ABN , First Publish Date - 2021-02-24T02:51:41+05:30 IST
మహరాష్ట్ర, గోవా, కోల్కతా సర్కిళ్ల ఇప్పటికే అందుబాటులో ఉన్న వై-ఫై కాలింగ్ సేవలను వీఐ (వొడాఫోన్ ఐడియా)
న్యూఢిల్లీ: మహరాష్ట్ర, గోవా, కోల్కతా సర్కిళ్ల ఇప్పటికే అందుబాటులో ఉన్న వై-ఫై కాలింగ్ సేవలను వీఐ (వొడాఫోన్ ఐడియా) ఇప్పుడు ఢిల్లీలోనూ లాంచ్ చేసింది. ఫలితంగా ఖాతాదారులు సెల్యూలార్ నెట్వర్క్ను ఉపయోగించకుండా వై-ఫై నెట్వర్క్ ద్వారానే కాల్స్ చేసుకోవచ్చు. అందుకోవచ్చు.
వై-ఫై కాలింగ్ సేవలు ఇప్పుడు ఢిల్లీలోనూ అందుబాటులోకి రావడంతో మొత్తం ఐదు సర్కిళ్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. వై-ఫై కాలింగ్ కోసం యూజర్లు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లోని సాఫ్ట్వేర్ అందుకు సహకరించాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపాటిబిలిటీ ఉంటే తప్ప వై-ఫై కాలింగ్ చేసుకోవడం కష్టం. ప్రస్తుతం కొన్ని స్మార్ట్ఫోన్లే ఇందుకు సపోర్ట్ చేస్తున్నాయి.
వీఐ వై-ఫై కాలింగ్ సేవలను ప్రస్తుతం వన్ప్లస్, షియోమీ బ్రాండ్ల ఫోన్లకే పరిమితం కానున్నాయి. అయితే, మున్ముందు మరిన్ని ఫోన్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దశల వారీగా వై-ఫై కాలింగ్ సదుపాయాన్ని తమ ఖాతాదారులందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వొడాఫోన్ ఐడియా తెలిపింది.