మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ వీహెచ్పీ ఆందోళన
ABN , First Publish Date - 2020-10-25T03:15:42+05:30 IST
మహారాష్ట్రలో మూతపడిన ఆలయాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా...
నాగ్పూర్: మహారాష్ట్రలో మూతపడిన ఆలయాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. నాగ్పూర్లో 11 ఆలయాల వెలుపల వీహెచ్పీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు. ‘‘షాపింగ్ మాల్స్, మార్కెట్లు, చివరికి బార్ షాపులు కూడా తెరిచారు. మరి ఆలయాలు తెరవడానికి ఇబ్బంది ఎందుకు?’’ అని వీహెచ్పీ నేత గోవింద్ షిండే ప్రశ్నించారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్నందున రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలను తెరవడం కుదరదంటూ శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం చెబుతోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 16,38,961 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43,152 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం కూడా కొత్తగా 6,417 మందికి కొవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,40,194 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.