పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్‌లోకి డీఎస్ వెళ్లిపోయారు: వీహెచ్

ABN , First Publish Date - 2021-12-18T18:16:42+05:30 IST

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు.

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్‌లోకి డీఎస్ వెళ్లిపోయారు: వీహెచ్

ఢిల్లీ : టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో డి శ్రీనివాస్ అన్నీ అనుభవించారన్నారు. రెండు సార్లు పీసీసీ ఎంజాయ్ చేశారని.. అయితే పార్టీ కష్టాల్లో ఉన్నపుడు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారన్నారు. డి శ్రీనివాస్ కుమారుడు బీజేపీలో ఎంపీ అయ్యారన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. కష్టాల్లో ఉన్నపుడు పార్టీని వీడి ఇప్పుడు వస్తే ఎలా అని అడుగుతున్నారని వీహెచ్ పేర్కొన్నారు. డి శ్రీనివాస్ కొడుకు కూడా కాంగ్రెస్‌లోకి రావాలన్నారు. కేవలం డి.శ్రీనివాస్ చేరిక వల్ల పార్టీకి ఉపయోగం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. గతంలో చేసిన తప్పును సరిదిద్దుకున్నా.. తన కుటుంబం అంతా కాంగ్రెస్ కుటుంబం అన్నపుడు అరవింద్‌ను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చాలన్నారు. టీఆర్ఎస్‌లో పదవీకాలం ముగుస్తుందని... మళ్ళీ ఇస్తారో లేదో తెలీదని.. అందుకే టీఆర్ఎస్‌ను వీడుతున్నారని వీహెచ్ తెలిపారు.

Updated Date - 2021-12-18T18:16:42+05:30 IST