మధుర గాయకుడు ఆనంద్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-05-10T22:12:08+05:30 IST

కళాకారులు జాతి సంపదని వారిని కాపాడు కోవలసిన అవసరం ప్రతి దేశానికి ఉన్నదని వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానాన్ని

మధుర గాయకుడు ఆనంద్‌కు ఘన నివాళి

హ్యూస్టన్/టెక్సాస్: స్వరమాధురి సంస్థ వ్యవస్థాపకులు, మధుర గాయకులు జి. ఆనంద్‌కు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అంతర్జాలం వేదికగా జరిగిన సంస్మరణ కార్యక్రమంలో ఐదు దశాబ్దాల పాటు సినీ సంగీత రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6500కు పైగా కచేరీలను ఆనంద్ నిర్వహించారని, ఎంతో మంది గాయనీ, గాయకులను తయారు చేశారన్నారు. ప్రపంచంలోని ఏడు దేశాలనుంచి వక్తలు పాల్గొన్నారు. 


కరోనా సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేక ఆనంద్ మరణించిన తీరును అందరూ ప్రస్తావిస్తూ.. కళాకారులు జాతి సంపదని వారిని కాపాడు కోవలసిన అవసరం ప్రతి దేశానికి ఉన్నదని వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర సమయంలో కళాకారులను ప్రత్యేకంగా ఆదుకునే విధానాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమాన్ని వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా, సంతోషం ఫిలిం న్యూస్ ఇండియా, శారద ఆకునూరి సంయుక్తంగా నిర్వహించారు. అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి శారద ఆకునూరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యూ జెర్సీ నుంచి దాము గేదెల పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆనంద్ పేర అంతర్జాతీయంగా ఒక సంగీత పురస్కారాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటులు, మాజీ పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ మాగంటి మాట్లాడుతూ.. ఆనంద్ తన ఎన్నో చిత్రాల పాటలకు గాత్రం ఇచ్చారని, వారి సుమధుర గీతాలు తన పాత్రలకు న్యాయం చేశాయన్నారు. అమెరికాకు చెందిన ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ.. ఆనంద్ గానాన్ని చాలా సార్లు విన్నానని, వెంటిలేటర్ దొరకక ఒక గాయకుడు మరణించడం కలచి వేసిందన్నారు.




ఈ అంతర్జాల నివాళి సభలో మండలి బుద్ద ప్రసాద్, ఘంటసాల రత్నకుమార్,  భువన చంద్ర, మాధవ పెద్ది సురేశ్, ఆర్పీ పట్నాయక్, సురేష్  కొండేటి, సారిపల్లి  కొండలరావు, డా నగేష్ చెన్నుపాటి, ఉపేంద్ర చివుకుల, ప్రసాద్ తోటకూర, డా ఆళ్ల శ్రీనివాస్, శారద సింగిరెడ్డి, దాము గేదెల, రవి కొండబోలు, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీనివాస్ చిమట, రమణ జువ్వాది, రత్న కుమార్ కవుటూరు, తాతాజీ ఉసిరికల, అనిల్ , హరి వేణుగోపాల్, రామాచారి, మల్లికార్జున్, రాము, ప్రవీణ్ కుమార్ కొప్పుల, వేణు శ్రీరంగం , సురేఖ మూర్తి దివాకర్ల, జీవీ ప్రభాకర్, విజయలక్ష్మి చంద్రతేజ, మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఆనంద్‌తో తమ అనుబంధాన్ని పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు.  

Updated Date - 2021-05-10T22:12:08+05:30 IST