నేటి నుంచి విత్తన వేరుశనగ పంపిణీ

ABN , First Publish Date - 2021-05-17T06:39:05+05:30 IST

జిల్లాలో నిర్దేశించిన రైతు భరో సా కేంద్రాల్లో సోమవారం నుం చి తొలివిడత సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుం ది.

నేటి నుంచి విత్తన వేరుశనగ పంపిణీ

అనంతపురం వ్యవసాయం, మే 16:  జిల్లాలో నిర్దేశించిన రైతు భరో సా కేంద్రాల్లో సోమవారం నుం చి తొలివిడత సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుం ది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మం త్రి శంకరనారాయణ సోమవారం ఉదయం 10 గంటలకు పెనుకొండ మండలం దుబ్బెబండలో విత్తన పంపిణీని ప్రాంభించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. క్వింటాల్‌ విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.8680గా నిర్ణయించారు. ఇందులో 40 శాతం సబ్సిడీ రూ.3472 పోను రైతు వాటా కింద క్వింటాల్‌కు రూ.5208 చెల్లించాల్సి ఉంటుంది. విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో రైతుకు మూడు బస్తాలు (బస్తా 30 కేజీలు) విత్తన వేరుశనగ పంపిణీ చేస్తారు. తొలి విడత కింద ఇప్పటిదాకా 45986 మంది పేర్లను రిజిస్ర్టేషన చేసుకున్నారు. వీరిలో 32979 మంది రైతులు 28738 క్వింటాళ్లకు డబ్బు చెల్లించారు. రైతు భరోసా కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రైతులకు విత్తన వేరుశనగ పంపిణీ చేయనున్నట్లు ఇనచార్జి జేడీఏ రామకృష్ణ పేర్కొన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయి లో అధికారులు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.


Updated Date - 2021-05-17T06:39:05+05:30 IST