Chennai చేరిన ఉప రాష్ట్రపతి
ABN , First Publish Date - 2022-01-14T14:33:54+05:30 IST
భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం చెన్నై చేరు కున్నారు. తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకయ్యకు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, మంత్రి
చెన్నై: భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం చెన్నై చేరు కున్నారు. తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకయ్యకు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, మంత్రి టీఎం అన్బరసన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగను ఇక్కడే జరుపుకోనున్న ఉపరాష్ట్రపతి.. ఈ నెల 17వ తేదీన విజయవాడ బయలుదేరి వెళ్తారు.