ఉద్యమాన్ని ఆపగలిగితే ఆపండి: వెంకట్రామిరెడ్డి
ABN , First Publish Date - 2022-01-27T23:25:13+05:30 IST
మంత్రుల కమిటీపై పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే ఉద్యోగ సంఘాలతో..
అమరావతి: మంత్రుల కమిటీపై పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఆపగలం అనుకుంటే ఆపండని హెచ్చరించారు. పాత జీతమే ఇవ్వాలని ఇప్పటికే మంత్రుల కమిటీని కోరినట్లు సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. మంత్రులతో చర్చలకు తాము బిగుసుకు కూర్చుకున్నామనడం సరికాదన్నారు. ఎవరు వెళ్లి చెప్పినా ఇదే విషయం చెబుతామని, సానుకూలంగా స్పందన వస్తే చూస్తామని చెప్పారు. ఈ నెల కూడా పాత జీతమే అడిగినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు.