ఆ జీవోని వెనక్కి తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి
ABN , First Publish Date - 2022-01-18T21:42:08+05:30 IST
తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వచ్చారు.
అమరావతి :తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కార్యాలయంలోని ఉన్నతాధికారులను కలిశారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో వెనక్కి తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్లు సీఎంవో అధికారులకు వెంకట్రామిరెడ్డి తెలిపారు. పీఆర్సీ పై ఇచ్చిన జీవోపై సీఎం జగన్ను కలిసేందుకు వెంకట్రామిరెడ్డి ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం.