‘ఏసీబీ విచారణకు సిద్ధమా?.. ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలకు బెదిరింపులు’

ABN , First Publish Date - 2021-12-12T00:08:30+05:30 IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలపై...

‘ఏసీబీ విచారణకు సిద్ధమా?..  ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలకు బెదిరింపులు’

అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలపై బెదిరింపులకు దిగారు. పీఆర్సీ లేట్ కావడం వాస్తవమేనంటూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఎవరి ఆస్తులు ఎంతో ఏసీబీ ఎంక్వైయిరీకి సిద్ధమా అని వెంకట్రామిరెడ్డి సవాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 



Updated Date - 2021-12-12T00:08:30+05:30 IST