దుష్ప్రచారం నమ్మొద్దు: వెంకట్రామిరెడ్డి
ABN , First Publish Date - 2020-07-11T08:49:47+05:30 IST
దుష్ప్రచారం నమ్మొద్దు: వెంకట్రామిరెడ్డి
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు స్పష్టం చేశారు. వయసు తగ్గింపు, పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదన్నారు.