వేరొకరితో మాట్లాడుతోందని.. సహజీవనం చేస్తున్న వివాహితను..
ABN , First Publish Date - 2020-08-07T18:13:58+05:30 IST
వేరొకరితో మాట్లాడుతోందని కక్ష పెంచుకుని తనతో సహజీవనం చేస్తున్న వివాహితను..
తాడేపల్లిగూడెం(పశ్చిమ గోదావరి): వేరొకరితో మాట్లాడుతోందని కక్ష పెంచుకుని తనతో సహజీవనం చేస్తున్న వివాహితను కడతేర్చి పురుగుల మం దు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వెంకట్రామన్నగూడేనికి చెందిన ఎర్రా సూర్యారావు (49) గురువారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేబ్రోలు పోలీసు స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం అనుమానంతో మడకం రామలక్ష్మి అనే వివాహిత హత్యకు గురైన విషయం పాఠకులకు విదితమే. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు న్నట్టు రూరల్ సీఐ వీరా రవికుమార్ తెలిపారు.