కన్నులపండువగా వెంకటేశ్వరస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-05-27T05:47:43+05:30 IST

పట్ట ణంలోని కొత్తపేట వెం కటేశ్వ రస్వామి దేవాలయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని గురువా రం కన్నులపండువగా నిర్వహిం చారు.

కన్నులపండువగా వెంకటేశ్వరస్వామి కల్యాణం
ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు



ధర్మవరం, మే 26: పట్ట ణంలోని కొత్తపేట వెం కటేశ్వ రస్వామి దేవాలయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని గురువా రం కన్నులపండువగా నిర్వహిం చారు. అర్చకులు రాజేశ, మోహనస్వామి ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పట్టువ స్ర్తాలు, వివిధ రకాల పూలు, తులసి మాలలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం డాక్టర్‌ సుధాకర్‌ దంపతుల చేత సంప్రదాయ పద్ధతిలో అర్చకులు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలాగే స్థానిక కొత్తపేట లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం గణపతతి సచ్చిదానంద స్వామిజీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణపతి సచ్చిదానంద ట్రస్టు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూజలు చేసి, సంకీర్తనలు ఆలపించారు. పట్టణంలో కొత్తపేట షిర్డీ సాయిబాబా దేవాలయం, కాలేజ్‌ సర్కిల్‌లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.


Updated Date - 2022-05-27T05:47:43+05:30 IST