వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం లెక్కింపు
ABN , First Publish Date - 2021-02-26T06:21:06+05:30 IST
ధవళేశ్వరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు.
ధవళేశ్వరం, ఫిబ్రవరి 25: ధవళేశ్వరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి మంగళంపల్లి సంగమేశ్వరశర్మ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. 11 నెలలకుగాను రూ. 3,48,240 ఆదా యం హుండీల ద్వారా లభించింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సాధనాల చంద్రశేఖర్, సత్యం వెంకటరమణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.