చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.1.48 కోట్లు

ABN , First Publish Date - 2021-08-04T04:42:56+05:30 IST

వేంకటేశ్వరస్వామి ఆలయంలో గడిచిన 49 రోజుల్లో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండో రోజు మంగళవారం కొనసాగింది.

చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.1.48 కోట్లు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది

ద్వారకాతిరుమల, ఆగస్టు 3: వేంకటేశ్వరస్వామి ఆలయంలో గడిచిన 49 రోజుల్లో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు రెండో రోజు మంగళవారం కొనసాగింది. రూ.1,48,10,580 నగదు, బంగారం 271 గ్రాము లు, వెండి 3.515 కేజీలు వచ్చినట్లు ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T04:42:56+05:30 IST