పోయిన సొమ్ము అప్పగించిన చిరు వ్యాపారి
ABN , First Publish Date - 2020-07-10T11:08:09+05:30 IST
పట్టణంలోని కోపరేటివ్ కాలనీకి చెందిన కే.జ్యోతి పోగొట్టుకున్న బంగారం, నగదును గురువారం ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావు సమక్షంలో..
10 సవర్ల బంగారం, రూ.3500నగదు అప్పగింత
వ్యాపారిని అభినందించిన సీఐ శ్రీనివాసరావు
కావలి రూరల్, జూలై9: పట్టణంలోని కోపరేటివ్ కాలనీకి చెందిన కే.జ్యోతి పోగొట్టుకున్న బంగారం, నగదును గురువారం ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావు సమక్షంలో చిరు వ్యాపారి అయిన పిల్లి వెంకటేశ్వర్లు బాధితులకు అప్పగించారు. వివరాల మేరకు కోపరేటివ్ కాలనీకి చెందిన జ్యోతి తన పిల్లలతో కలిసి బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురం నుంచి ఆటో లో బుధవారం సాయంత్రం కావలి వచ్చారు.
పట్టణంలోని ఏఎం బేకరీ సమీపంలో పిల్లలకు షోడా తాగించి ఆటోలో ఇంటికి వెళ్లే సమయంలో నగలు పోగొట్టుకున్నారు. స్టీలు సామాన్లు వాయిదాల పద్ధతిలో విక్రయించే గాయత్రీనగర్కు చెందిన పిల్లి వెంకటేశ్వర్లుకు ఫైర్ ఆఫీసుకు సమీపంలో నగలు ఉన్న పర్సు దొరికింది. వెంటనే వెంకటేశ్వర్లు పోలీసులను ఆశ్రయించి వారి సహాయంతో బాధితులకు ఆ పర్సును అందజేశారు. సుమారు రూ. 4 లక్షల విలువ చేసే నగదు దొరికినప్పటికీ నిజాయితీగా అప్పగించిన వెంకటేశ్వర్లును సీఐ అభినందించారు.