మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వెంకటనర్సయ్య

ABN , First Publish Date - 2022-05-18T06:29:40+05:30 IST

నల్లగొండ జిల్లా కేం ద్రంలోని మున్నూరుకాపు సంఘ కార్యాలయంలో మంగళవా రం జరిగిన సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా వాసుదేవుల వెంకటనర్సయ్య, ప్ర ధాన కార్యదర్శిగా నేతి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.

మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వెంకటనర్సయ్య
ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానిస్తున్న నాయకులు

నల్లగొండ, కొం డమల్లేపల్లి, మే 17: నల్లగొండ జిల్లా కేం ద్రంలోని మున్నూరుకాపు సంఘ కార్యాలయంలో మంగళవా రం జరిగిన  సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా వాసుదేవుల వెంకటనర్సయ్య, ప్ర ధాన కార్యదర్శిగా నేతి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో కోశాధికారిగా సంపెంగల సురేందర్‌ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు కోట్ల రామలింగం, వైద్యం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు మాట్లాడుతూ మున్నూరుకాపుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మున్నూరుకాపు సంక్షేమ భవనం, విద్యార్థి వసతిగృహం నిర్మిం చడానికి తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో  వివిధ సం ఘాల నాయకులు సమీర్‌కుమార్‌, వైద్యుల సత్యనారాయణ, జవ్వాజి ఇంద్రయ్య, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T06:29:40+05:30 IST