వెంకటాచలంలో చోరీ
ABN , First Publish Date - 2021-07-27T03:23:48+05:30 IST
: వెంకటాచలంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి
వెంకటాచలం, జూలై 26 : వెంకటాచలంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు, వెలుగు శాఖలో సీసీగా పని చేసే కొవ్వూరు వసంత స్థానికంగా నివాసం ఉంటున్నారు. వసంత ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న తాళాన్ని పగులకొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 66 గ్రాముల బంగారు అభరణాలను అపహరించుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.1,23,750లు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ జీ జగన్మోహన్రావు, ఎస్ఐ షేక్ కరీముల్లా చోరీ జరిగిన తీరును పరిశిలించారు. క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.