రైతులు కావాలనే పంటలు తగలబెడుతున్నారా?
ABN , First Publish Date - 2020-11-01T00:57:22+05:30 IST
వరద సాయం అందించాలంటూ హైదరాబాద్లోని పలు కాలనీల్లో ఆందోళనలు చేపట్టారు.అంబర్పేట, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, మలక్పేట్, చందానగర్, ఉప్పల్, పటాన్చెరు, సరూర్నగర్లో..
సన్న రకం వరి వేయాలని చెప్పిన ప్రభుత్వం మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ప్రకటించాలని ప్రజాప్రతినిధులను రైతులు నిలదీస్తున్నారు. క్వింటాకు రూ.2,500 ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపఎన్నిక నేపథ్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా పోలీసు కనుసన్నల్లో ఉంది. నవంబరు 3వ తేదీన పోలింగ్ ఉండడంతో నిఘాను తీవ్రతరం చేశారు.
వరద సాయం అందించాలంటూ హైదరాబాద్లోని పలు కాలనీల్లో ఆందోళనలు చేపట్టారు.అంబర్పేట, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, మలక్పేట్, చందానగర్, ఉప్పల్, పటాన్చెరు, సరూర్నగర్లో బాధితుల ఆందోళనకు దిగారు. పలువురు కార్పొరేటర్ల ఇళ్లను ముట్టడించారు. టీఆర్ఎస్ నేతలు, అధికారులు రూ.5వేలు కమీషన్ తీసుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. కేవలం ఒక పార్టీకి చెందినవారికే వరద సాయం అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘‘వరంగల్లో దుబ్బాక బరి గీసిన కేసీఆర్. గిట్టుబాటు ధరల పాపం కేంద్రానిదేనంటూ సవాల్. కావాలనే పంటలు తగులబెడుతున్నారన్న సీఎం సార్. దుబ్బాక ఎన్నికలపై పంటల్లో మంటల సెగలు. హైదరాబాద్ వరద సాయంలో టీఆర్ఎస్ నేతల వసూళ్లు. ఇబ్బందికర సమయంలో అస్ర్తాలు ఎక్కు పెట్టిన కేసీఆర్.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.