పరిగి కోర్టు ఏజీపీగా వెంకట్రెడ్డి
ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST
పరిగి కోర్టు ఏజీపీగా వెంకట్రెడ్డి
పరిగి, జూలై 2 : పరిగి మున్సిఫ్ కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది బి.వెంకట్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు లీగల్ అఫైర్స్, లెజిస్లేటివ్ ఎఫైర్స్ అండ్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శ నందికొండ నర్సింగ్రావు నియామక పత్రాన్ని అందజేశారు. కులకచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన వెంకట్రెడ్డి పరిగి కోర్టులో 1997 నుంచి లా ప్రాక్టీస్ చేస్తున్నారు. పరిగి కోర్టులో ఏజీపీ వెంకట్రెడ్డి పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, పూడూరు మండలాలకు సంబంధించిన కేసులకు సంబంధించి పేదల తరఫున ప్రభుత్వ న్యాయవాదిగా ఉచిత సేవలు అందించారు.