వెంకన్నకు హంసవాహన సేవ

ABN , First Publish Date - 2021-04-13T06:18:53+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు ఆధ్వర్యంలో స్వామివారి అధ్యయన ఉత్సవాలు ఐదు రోజులు ఘనంగా నిర్వహించారు.

వెంకన్నకు హంసవాహన సేవ
గ్రామోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

  ముగిసిన అధ్యయన ఉత్సవాలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 12: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు ఆధ్వర్యంలో స్వామివారి అధ్యయన ఉత్సవాలు ఐదు రోజులు ఘనంగా నిర్వహించారు. ఆఖరి రోజు సోమవారం వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదపండితులు ద్రవిడ వేద పారాయణం చేశారు. అనంతరం రాత్రి గరుడ, సింహ, హంస వాహనాలపై స్వామివారి గ్రామోత్సవం కనులపండువగా నిర్వహించారు. నమళ్వార్‌ పరమపదోత్సవం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. 

Updated Date - 2021-04-13T06:18:53+05:30 IST