వెంకమ్మ పేరంటాల భక్తుల కోసం ఈ-హుండీ

ABN , First Publish Date - 2021-05-17T06:19:43+05:30 IST

కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఆలయానికి రాలేని భక్తుల సౌలభ్యం కోసం ఈ - హుండీ విధానం అమలులోకి తీసుకొస్తున్నట్లు రామవరప్పాడు గ్రామ దేవత వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి పాతూరి లోకేశ్వరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

వెంకమ్మ పేరంటాల   భక్తుల కోసం ఈ-హుండీ

గుణదల, మే 16 : కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఆలయానికి రాలేని భక్తుల సౌలభ్యం కోసం ఈ - హుండీ విధానం అమలులోకి తీసుకొస్తున్నట్లు  రామవరప్పాడు గ్రామ దేవత వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి  పాతూరి లోకేశ్వరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో అమ్మవార్లకు జరిగే పూజా కైంకర్యాలను  భక్తులు తిలకించేందుకు వీలుగా యూ ట్యూబ్‌ చానల్‌ అందుబాటులో ఉంచనునట్లు తెలిపారు.  మొక్కుబడులు చెల్లించాల్సిన భక్తులు దేవదాయశాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి టిఎంఎ్‌స.ఏపి.జిఓవి.ఇన్‌ ద్వారా  శ్రీవెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానం, రామవరప్పాడు, విజయవాడ రూరల్‌ ఎంచుకొని మొక్కుబడులు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-17T06:19:43+05:30 IST