కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు
ABN , First Publish Date - 2021-03-05T14:34:50+05:30 IST
తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ప్రార్థించానని ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం ఆనందదాయకం, దేశ ప్రజలంతా పరిపూర్ణ ఆరోగ్యం, సుఖశాంతులతో వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించా’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.