విపత్కర పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాం: వెంకయ్య
ABN , First Publish Date - 2021-10-17T18:45:51+05:30 IST
విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు.
హైదరాబాద్: మనం విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని కానీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇంకా ఉందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం హైదరాబాద్ జలవిహార్లో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఇది ఉదాత్తమైన కార్యక్రమం అని, అందరం ఒక కుటుంబంగా ఉండాలని, కుల, మత, భాష విభేదాలను పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు. ప్రాచీన వారసత్వం మనం కాపాడాలని, మన అస్తిత్వం కోల్పోకూడదన్నారు. ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రతి ఇంటి పండుగని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.