నెల్లూరుపై పాట పాడాలని కోరా: వెంకయ్య

ABN , First Publish Date - 2020-08-15T23:36:30+05:30 IST

నెల్లూరుపై పాట పాడాలని కోరా: వెంకయ్య

నెల్లూరుపై పాట పాడాలని కోరా: వెంకయ్య

ఢిల్లీ: రాజకీయాలు తన జీవితంలో ముగిసిన అధ్యాయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలోనే పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయన్నారు. కరోనాను భారత్‌ సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలని ఆయన పేర్కొన్నారు. కరోనా సమయంలో కొత్త భాష నేర్చుకోవాలన్నారు. 


కాగా ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిని ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ఉత్తమ వైద్యులు ఎస్పీబీకి చికిత్స ఆందిస్తున్నారని తెలిపారు. 5 రోజుల క్రితమే ఎస్పీబీతో మాట్లాడి నెల్లూరుపై పాట పాడాలని కోరానని చెప్పారు. వెన్నెలకంటితో రాయించి పాడుతానని హామీ ఇచ్చారని చెప్పారు. త్వరలోనే కోలుకుని తన కోరికను నిజం చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T23:36:30+05:30 IST