వలస కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి: వెంకయ్య

ABN , First Publish Date - 2020-06-07T08:18:07+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తున్న నేపథ్యంలో వలస కార్మికులకు సంబంధించి సరైన సమాచారాన్ని

వలస కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి: వెంకయ్య

న్యూఢిల్లీ, జూన్‌ 6: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తున్న నేపథ్యంలో వలస కార్మికులకు సంబంధించి సరైన సమాచారాన్ని క్రోడీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. కార్మికులకు అవసరమయ్యే నైపుణ్యాలను అందించి, వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని శనివారం ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. వలస కార్మికుల సంక్షేమానికి, జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై వారికి అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.   

Updated Date - 2020-06-07T08:18:07+05:30 IST