‘ఫైబర్ నెట్ స్కాంపై ఏ విచారణకైనా రెడీ’

ABN , First Publish Date - 2020-09-20T20:01:04+05:30 IST

ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కాం జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలను మాజీ ఐటీ సలహాదారు వేమూరి హరిప్రసాద్ ఖండించారు.

‘ఫైబర్ నెట్ స్కాంపై ఏ విచారణకైనా రెడీ’

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కాం జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలను మాజీ ఐటీ సలహాదారు వేమూరి హరిప్రసాద్ ఖండించారు. ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తనకు టెండర్లపై సంతకం చేసే అధికారం కూడా లేదని స్పష్టం చేశారు. కేవలం సలహాలద్వారా భాగస్వామిగా మాత్రమే ఉన్నానని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు మీడియా సమావేశాల్లో మాట్లాడేటప్పుడు సమాచారం తెలుసుకుని మాట్లాడితే విజ్ఞతగా ఉంటుందని అన్నారు.

Updated Date - 2020-09-20T20:01:04+05:30 IST