సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-01-14T06:54:09+05:30 IST

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి వేమూరి ఉషారాణి పేర్కొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

రెవెన్యూ కార్యదర్శి ఉషారాణి

ఘంటసాల, జనవరి 13 : మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి వేమూరి ఉషారాణి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన స్వగ్రామమైన ఘంటసాలపాలేన్ని బుధవారం ఆమె భర్త ఎం.కాంతారావు (ఐపీఎస్‌)తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి అని, ఈ పండుగ సందర్భంగా తన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులను కలుసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. తన బాల్యంలో గ్రామంలో గడిపిన జ్ఞాపకాలను ఆమె నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామప్రముఖులు వేమూరి రాంబాబు, మునగల ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T06:54:09+05:30 IST