‘రమణదీక్షితులకు మేలుచేస్తే, బ్రాహ్మణులందరికీ న్యాయం జరిగినట్టా?’

ABN , First Publish Date - 2021-04-11T19:46:37+05:30 IST

వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏం ఒరగబెట్టిందో కోన రఘుపతి, మల్లాది విష్ణు చెప్పగలరా?

‘రమణదీక్షితులకు మేలుచేస్తే, బ్రాహ్మణులందరికీ న్యాయం జరిగినట్టా?’

అమరావతి: వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏం ఒరగబెట్టిందో కోన రఘుపతి, మల్లాది విష్ణు చెప్పగలరా? అని వేమూరి ఆనంద్ సూర్య ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019-20, 2020-21 బడ్జెట్లలో బ్రాహ్మణులకు కేటాయించిన రూ.244 కోట్లను ఎవరికి, ఎందుకు ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. రమణదీక్షితులకు, ఆయన కుటుంబానికి మేలుచేస్తే, బ్రాహ్మణులందరికీ న్యాయం జరిగినట్టా? అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు జరిగిన మేలుపై ఆధారాలు, అంకెలతో సహా చర్చకు తాను సిద్ధమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం లక్షా 62 వేల బ్రాహ్మణ కుటుంబాలకు న్యాయం చేసిందన్నారు. దీనిపై తనతో చర్చకు కోన రఘుపతి, మల్లాది విష్ణులు సిద్ధమా? అని సవాల్ చేశారు. రాష్ట్రంలో  వైసీపీలో బ్రాహ్మణ నేతలే లేరన్నట్లు మల్లాది విష్ణుకి మూడు పదవులిస్తారా అని తీవ్రస్థాయిలో విమర్ళలు చేశారు. తిరుపతి ఉపఎన్నికలో పనబాక లక్ష్మి 2 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తారని ఆనంద్ సూర్య ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-11T19:46:37+05:30 IST